బోర్డర్ లో పాకిస్తాన్ డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యం

బోర్డర్ లో పాకిస్తాన్ డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యం

జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఇవాళ(శనివారం) పాకిస్తాన్ డ్రోన్ ను కూల్చేశారు భారత సెక్యూరిటీ ఫోర్సెస్(BSF). పాక్ చర్యలను అడ్డుకోవడానికి సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. చలికాలంలో ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తోందని… అందుకే ఈలోగానే ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని తెలిపారు BSF అధికారులు. ఈ డ్రోన్ ను‌ చైనా కంపెనీ డీజేఐ తయారుచేసిందనీ… దాని పేరు మావిక్-2 ప్రో అని చెప్పారు.

ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా తన సహాయ సహకారాలను పాకిస్తాన్ అందిస్తోంది. ఆయుధాలను కూడా డ్రోన్లతో అందిస్తోంది. మరోవైపు మన ఆర్మీ కదలికలను కూడా డ్రోన్ల సహకారంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పాక్ కు చెందిన పలు డ్రోన్లను మన సైనికులు కూల్చేశారు. లేటెస్టుగా శనివారం ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. నియంత్రణ రేఖ దగ్గర ఏదో కదులుతున్నట్టు గుర్తించిన  BSF దళాలు … పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ గా గుర్తించి..వెంటనే దాన్ని కూల్చేశారు.