- చండీగఢ్లోని వినియోగదారుల హక్కుల ఫోరం తీర్పు
చండీగఢ్: కాఫీ కప్కు రూ.5 చార్జ్ వేసిన బరిస్టా కేఫ్కు రూ.22 వేల ఫైన్ పడింది. చండీగఢ్లో ఇద్దరు కస్టమర్ల కంప్లయింట్స్ పై విచారణ చేపట్టిన వినియోగదారుల హక్కుల ఫోరం.. కేఫ్కు రూ.22 వేల ఫైన్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. పంజాబ్లోని మొహాలీకి చెందిన షాబాద్ ప్రీత్ సింగ్ 2021 జనవరి 9న చండీగఢ్ సెక్టార్ 35లోని బరిస్టా కేఫ్ కు వెళ్లారు. అక్కడ ఆయన హాట్ చాకొలేట్ ఆర్డర్ ఇచ్చారు. దీనికి రూ.200 బిల్లు వేశారు. అందులో పేపర్ కప్కు కూడా రూ.5 చార్జ్ వేసినట్లు షాబాద్ గుర్తించారు.
ఆ కప్పై బరిస్టా కేఫ్ పేరు రాసి ఉందని, చార్జ్ ఎలా వేస్తారని సిబ్బందిని ప్రశ్నించగా సరైన జవాబు చెప్పలేదు. దీంతో ఆయన చండీగఢ్లోని వినియోగదారుల హక్కుల ఫోరంలో కంప్లయింట్ చేశారు.ఇలాగే మరో కస్టమర్ పర్మీందర్ జిత్ కూడా ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన వినియోగదారుల హక్కుల ఫోరం.. బరిస్టా కేఫ్కు రూ.22 వేల ఫైన్ విధిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఒక్కో కస్టమర్ కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలని, చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో పూర్ పేషెంట్స్ ఫండ్ కు మిగతా20 వేలు జమ చేయాలని ఆదేశించింది.