పబ్జీ అడిక్టెడ్: సైకిళ్ల దొంగ అరెస్ట్..

పబ్జీ అడిక్టెడ్: సైకిళ్ల దొంగ అరెస్ట్..

హైదరాబాద్: సైకిళ్ల దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ మల్కాజ్ గిరి లో  సిద్ధార్థ శర్మ(19) అనే టీనేజర్ గత సంవత్సరం నుంచి.. పలు సైకిళ్లను దొంగతనం చేశాడని తెలిపారు పోలీసులు. ఇందులో గేర్ సైకిళ్లు అధికంగా ఉన్నాయని అన్నారు. మౌలాలి, మంగాపురంలో నివసించే సిద్దార్థ శర్మ.. అతని తల్లితో గొడవపడి.. బయటే ఉంటున్నాడు. ఇతనికి పబ్ జీ ఆడటం వ్యసనంగా మారిందని… దీంతో పాటే… అప్పులు కూడా ఎక్కువగానే అయ్యాయని పోలీసులు తెలిపారు.

సైకిళ్లు పోయాయని 16మంది ఫిర్యాదులు ఇవ్వడంతో.. విశ్వసనీయ సమాచారంతో సిద్ధార్థను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. దీంతో అతని దగ్గరనుంచి.. 31 సైకిళ్లు రికవరీ చేసినట్టు తెలిపారు. 16మంది మాత్రమే ఫిర్యాదు చేశారని… ఇంకెవరివైనా సైకిళ్లు పోయివుంటే పోలీసులకు తెలపాలని.. స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పారు మల్కాజిగిరి ఏసీపి నర్సింహారెడ్డి.