లాక్‌డౌన్‌ టైమ్‌లో చేసిన సేవలపై బీజేపీ ఈ–బుక్ తయారీ

లాక్‌డౌన్‌ టైమ్‌లో చేసిన సేవలపై బీజేపీ ఈ–బుక్ తయారీ

హైదరాబాద్: లాక్‌డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై బీజేపీ రాష్ట్ర శాఖ ఈ–బుక్‌ను తయారు చేయిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో బీజేపీ ఈ–బుక్‌ను రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ–బుక్‌ తయారీపై ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర బీజేపీ శాఖ వర్చువల్ మీటింగ్ నిర్వహించింది. తెలంగాణలోని గ్రామ, మండల, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కరోనా టైమ్‌లో చేసిన సేవా కార్యక్రమాల వివరాలు, వీడియోలు, ఫొటోలను రాష్ట్ర బీజేపీ నాయకులు సేకరిస్తున్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్ సమయంలో తాము చేసిన సేవా కార్యక్రమాలపై సిద్ధం చేయిస్తున్న ఈ‌–బుక్‌ను సోషల్ మీడియాలో పెట్టాలని బీజేపీ నిర్ణయించిందని తెలుస్తోంది. మహమ్మారి విజృంభణతో ఆపత్కర పరిస్థితుల నెలకొన్నప్పుడు ప్రజలకు బీజేపీ అందించిన సేవలను భవిష్యత్ తరాలకు చెప్పేందుకే ఈ–బుక్‌ను రూపొందిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.