కందనూలు, వెలుగు: సెల్ఫోన్ కొనియ్యడంలేదని తాగిన మత్తులో ఓ కొడుకు కన్న తండ్రిని చంపేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన నరసింహ(45)ను అతని కొడుకు మహేశ్ ఇనుపరాడ్తో తలమీద కొట్టడడంతో చనిపోయాడు. నర్సింహకు ఇద్దరు పిల్లలు. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్న కూతురికి ఇటీవల సెల్ఫోన్ కొనిచ్చాడు. తాగుడుకు అలవాటుపడి.. చదువు మధ్యలో ఆపేసిన మహేశ్ కూడా తనకు ఫోన్ కొనివ్వమని అడుగుతున్నాడు. ఆదివారం రాత్రి తాగి వచ్చి తండ్రితో గొడవ పడ్డాడు. మాటామాటా పెరిగి ఇనుప రాడ్తో కొట్టాడు. గాయపడిన నర్సింహను నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.