నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా..

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా..

రామకృష్ణాపూర్, వెలుగు: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా డుగు డుగు డుగు..’ అంటూ సాగిన పాటపై పెళ్లి బరాత్​లో మూడు నిమిషాల పాటు నవ వధువు పయ్యావుల సాయిశ్రేయ చేసిన డ్యాన్స్​కు యావత్​ తెలంగాణ ఫిదా అయ్యింది. పాటకు అనుగుణంగా పెండ్లి కొడుకు ఎదుట ఆమె వేసిన స్టెప్పులు ఆహా అనిపించాయి. ఈ వధూవరులిద్దరూ మంచిర్యాల జిల్లాకు చెందినవారే. వరుడు రామకృష్ణాపూర్​కు చెందిన ఆకుల అశోక్ మున్సిపాలిటీలో టౌన్​ప్లానింగ్ ​సూపర్​వైజర్ ​కాగా, జన్నారం మండలం పొనకల్ ​గ్రామానికి చెందిన వధువు సాయిశ్రేయ సాఫ్ట్​వేర్ ​ఎంప్లాయ్. వీరిద్దరికీ ఈ నెల 14న జన్నారం మండలం పొన్కల్​లోని పైడిపెల్లి గార్డెన్స్​లో మ్యారేజ్​జరిగింది. పెళ్లి అనంతరం జరిగిన బరాత్​లో సాయిశ్రేయ చేసిన డ్యాన్స్ సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ఈ సందర్భంగా కొత్త జంటకు లక్షల మంది తమ విషెస్​ చెప్పడం విశేషం.