EVMలతో TRS నేత : కేసు నమోదు

EVMలతో TRS నేత : కేసు నమోదు

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కీసర TRS నాయకుడు నాయకపు వెంకటేష్ పై కేసు పెట్టారు పోలీసులు. ఐపీసీ 447, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కీసర పోలీసులు.

మేడ్చల్ మల్కాజిగిరి లోక్ సభ సెగ్మెంట్ ఎన్నికకు వాడిన ఈవీఎంలను కీసర మండలం బోగారంలోని హోలీమేరీ ఇంజినీరింగ్ కాలేజీ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలో నిబంధనలకు విరుద్ధంగా.. నాయకపు వెంకటేశ్ ఫొటోలు దిగారు. దీనిపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్వీఆర్.చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. నాయకపు వెంకటేష్ పై పోలీసులు కేసు పెట్టారు. క్రైమ్ నెం 149/2019, అండర్ సెక్షన్ 447, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు కీసర పోలీసులు చెప్పారు.