విద్యార్థులకు CBSE షాక్ : పరీక్ష ఫీజు రెట్టింపు

విద్యార్థులకు CBSE షాక్ : పరీక్ష ఫీజు రెట్టింపు

CBSE విద్యార్థులకు షాక్ ఇచ్చింది బోర్డు. ఎన్నడూ లేనంతగా పరీక్ష ఫీజులను భారీగా పెంచింది.  10వ తరగతి, 12వ తరగతి చదివే ST, ST విద్యార్థులు ఇన్నాళ్లూ చెల్లిస్తున్న 50 రూపాయల పరీక్ష ఫీజును 1200 రూపాయలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు ప్రస్తుతం చెల్లిస్తున్న 750 రూపాయలకు రెట్టింపు.. అంటే 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST విద్యార్థుల ఎగ్జామ్ ఫీజును 24 రెట్లు పెంచారు.

గత వారమే ఈ పరీక్ష ఫీజుల పెంపుకు సంబంధించి స్కూళ్లకు ఆదేశాలు అందాయి. పెంచిన ఫీజులను కట్టించుకోవాలని తెలిపింది బోర్డు. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఈ పెంచిన ఫీజులు వర్తిస్తాయి.