పరీక్షల తేదీలు ప్రకటించిన సీఐఎస్​సీఈ

పరీక్షల తేదీలు ప్రకటించిన సీఐఎస్​సీఈ

న్యూఢిల్లీ: లాక్​డౌన్ కారణంగా పెండింగ్ లో ఉన్న 10, 12 వ తరగతుల పరీక్షల తేదీలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్​సీఈ) శుక్రవారం ప్రకటించింది. జులై 1 నుంచి 14 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ‘‘12 వ తరగతి స్టూడెంట్లకు పరీక్షలు జులై 2 నుంచి 12 వరకు జరుగుతాయి, 10 వ తరగతి స్టూడెంట్లకు జులై ఫస్టు నుంచి 14 వరకు నిర్వహిస్తాం. అభ్యర్థులు శానిటైజర్ బాటిల్స్, మాస్కులు వెంట తెచ్చుకోవాడం తప్పనిసరి” అని సీఐఎస్​సీఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెర్రీ అరాథాన్ అన్నారు. ఎగ్జామ్ హాల్స్ లో డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని, లాక్​డౌన్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని పరీక్షా కేంద్రాలను కోరారు.