పక్కా ప్లాన్ ప్రకారమే మంత్రిపై దాడి

పక్కా ప్లాన్ ప్రకారమే మంత్రిపై దాడి

పక్కా వ్యూహం ప్రకారమే మంత్రి జకీర్ హుస్సేన్ పై దాడి చేశారని ఆరోపించారు బెంగాల్ సీఎం మమత బెనర్జీ. కొందరు వ్యక్తులు తమ పార్టీలో చేరాలని జకీర్ పై ఒత్తిడి తెచ్చారన్నారు. ఆయన్ను హత్య చేయాలని కుట్ర చేశారన్నారు మమత. జకీర్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనలలో నిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి లక్ష పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడిన జకీర్ ను మమత పరామర్శించారు.