ఎప్పుడూ ప్రజా పాలనలో బిజీగా ఉండే పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ప్రజల మధ్యన ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా… అలీపూర్ దౌర్ జిల్లా ఫలకటాలో జరిగిన ఓ సామూహిక వివాహ వేడుకలో ఆమె పాల్గొన్నారు. ఈ వేడుకలో 300 మంది గిరిజన జంటలు పెళ్లి తో ఒక్కటయ్యాయి.మ్యారేజ్ తర్వాత మమతా బెనర్జీ ప్రజలతో కలిసి ఆడిపాడారు.
గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులేస్తూ అందరినీ అలరించారు దీదీ. నృత్య కళాకారుల చేతిలో చేయి వేసి ఆమె కూడా వారిలో కలిసిపోయి పాదం కదిపారు. అయితే మమత ఇలా పబ్లిక్ లో ఉల్లాసంగా డ్యాన్స్ చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు కోల్ కతాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో గిరిజన సంగీత కళాకారిని బసంతి హెంబ్రామ్ తో కలిసి స్టెప్పులేశారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee dances during a mass marriage ceremony in Falakata of Alipurduar district. pic.twitter.com/zIDyhRDS7x
— ANI (@ANI) February 2, 2021