కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియా స్వేచ్ఛను కాపాడుతాం

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియా స్వేచ్ఛను కాపాడుతాం

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీడియా స్వేచ్ఛను కాపాడుతామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో మీడియా స్వేచ్ఛను హరించలేదు... భవిష్యత్ లో అలా వ్యవహరించబోమని శ్రవణ్ అన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టుల అరెస్టును వ్యతిరేకించిన శ్రవణ్... ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేసే పోరాటంలో కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. అరెస్టు అయిన జర్నలిస్టులకు న్యాయ సహాయం అందించేందుకు సిద్ధమన్నారు. గాంధీభవన్ కు వస్తే అవసరమైన సాయమందిస్తామన్నారు. నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే కెసీఆర్ అణచివేస్తున్నారు. పాలకవర్గం సరిగా పనిచేస్తే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరమెందుకు వస్తుందని ప్రశ్నించారు.