రసాభాసగా పల్లె ప్రగతి కార్యక్రమం..

రసాభాసగా పల్లె ప్రగతి కార్యక్రమం..

మూడు చింతల పల్లి మండల కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది.ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. అయితే  అక్కడ జరుగుతున్న సభలో మంత్రులు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిచారు. దీంతో సభలో గొడవ జరిగింది. సభలో టీఆర్ఎస్,కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సభలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ హరి వర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి ఆయనను పోలీసు వాహనంలో స్టేషన్ కు తరలించారు.