
హైదరాబాద్, వెలుగు:గ్రేటర్ హైదరాబాద్లో కరోనాను కంట్రోల్ చేయడంలో శాఖల మధ్య కోఆర్డినేషన్ ప్రాబ్లమ్ కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ, మెడికల్, పోలీస్శాఖల తీరు ఎవరికి వారే అన్నట్టుగా సాగుతోంది. కంటెయిన్మెంట్ల నిర్వహణలోని ఫెయిల్యూర్సే ఇందుకు నిదర్శనం. వైరస్పై ప్రజలకు అవేర్నెస్ కల్పించడంతోపాటు తగు చర్యలు చేపట్టాల్సిన అధికారులు లైట్ తీసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. గ్రేటర్లో కేసులు భారీగా పెరుగుతుండగా, కట్టడిపై ఫోకస్ చేయడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారు. పాజిటివ్ కేసు నమోదైన చోట కంటెయిన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నారు. గడువు ముగిశాక ఎత్తేస్తున్నారు. మొన్నటిదాకా ఉన్న కంటెయిన్మెంట్ జోన్ల స్వరూపం కాస్త హోం క్వారంటెయిన్గా మారింది. ఒకటి, రెండు ఇండ్లకు మాత్రమే బారికేడ్లు పెట్టి రాకపోకలు బంద్పెడుతున్నారు. స్థానికులు బయట తిరుగుతున్నా కంట్రోల్చేయలేకపోతున్నారు.
ఒకరిపై మరొకరు..
‘‘లాక్డౌన్ రూల్స్ కచ్చితంగా అమలు చేయాల్సిందే. నిర్లక్ష్యంతో ఒక్క కేసు నమోదైనా పరిస్థితిని అదుపు చేయలేం’’ అని ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చెప్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ లో మాత్రం నిర్ణయాలు పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్అవడం లేదు. లోపాలపై ఫోకస్ చేయడం లేదు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 100 వరకు హోమ్ క్వారంటెయిన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అవి ఎక్కడెక్కడున్నాయో కూడా అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. హోం క్వారంటెయిన్లో ఉన్న వాళ్లు బయట తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఉల్లంఘనలకు బాధ్యత వహించాల్సిన అధికారులు ఒక శాఖపై మరొకరు నెట్టేసుకుంటున్నారు.
ఎవరిది బాధ్యత?
కంటెయిన్మెంట్ జోన్లలో కొత్త కేసులు నమోదవడం లేదని, ఆంక్షలు సడలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటి వివరాలు మాత్రం చెప్పడం లేదు. లంగర్హౌస్లో హోం క్వారంటెయిన్లో ఉండాల్సిన వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి ఫ్రెండ్స్తో మందు పార్టీ చేసుకున్నాడు. కాలనీలోకి వచ్చి న్యూసెన్స్ చేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అతడిని, అతడి స్నేహితులను క్వారంటెయిన్కు తరలించారు. ఈ విషయంపై స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదు. క్వారంటెయిన్లోని వ్యక్తులపై పర్యవేక్షణ బాధ్యత తమది కాదని పోలీసులదని అంటున్నారు. వాస్తవానికి, గ్రేటర్లోని అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసుకుంటూ కరోనాను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బల్దియాదేనని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి.