12 జిల్లాల్లో కరోనా యాక్టివ్ కేసులు జీరో

12 జిల్లాల్లో కరోనా యాక్టివ్ కేసులు జీరో

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రంలో ఇప్పటివరకు రెండు జిల్లాలకు మినహా 31 జిల్లాలకు కరోనా సెగ తగిలింది. వరంగల్​ రూరల్, వనపర్తి జిల్లాలు తప్ప అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. యాదాద్రి జిల్లాలో స్థానిక వ్యక్తులెవరికీ కరోనా సోకకున్నా.. ముంబై నుంచి ఆ జిల్లాకు వచ్చిన వలస కూలీలకు కరోనా ఉన్నట్లు తేలడంతో ఆ జిల్లా కూడా కేసులు నమోదైన జిల్లాల జాబితాలో చేరింది. అయితే పాజిటివ్​ కేసులు నమోదైన 31 జిల్లాల్లో ప్రస్తుతం 12 జిల్లాలకు చెందిన పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. ఈ జిల్లాల్లో పెద్దపల్లి (2 కేసులు)‌‌‌‌, భద్రాద్రి కొత్తగూడెం(4), కరీంనగర్(19), మహబూబాబాద్(1), మెదక్‌‌(6), ములుగు(2), నాగర్​ కర్నూల్(2), నల్లొండ(15), నారాయణపేట(1, డెత్‌‌), సిరిసిల్ల(3), సంగారెడ్డి(7), సిద్దిపేట(1) ఉన్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలన్నీ కరోనా పాజిటివ్​ కేసుల్లేని జిల్లాలుగా మారిపోయాయి.

19 జిల్లాలు.. 444  మంది పేషెంట్లు

ప్రస్తుతం 19 జిల్లాలకు చెందిన 444 పేషెంట్లు మాత్రమే కరోనాకు  ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు. కరోనా విజృంభించిన తొలిరోజుల్లో కరీంనగర్​లో నమోదైన 19 కేసుల్లో 18 మంది విడతలవారీగా డిశ్చార్చ్‌‌ అయ్యారు. చివరి పేషెంట్​ సోమవారం డిశ్చార్జీ కావడంతో కరీంనగర్​ జిల్లాలో యాక్టివ్​ కేసుల సంఖ్య జీరో అయింది. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో సోమవారం నాటికి 761 పాజిటివ్​ కేసులు నమోదు కాగా 379 మంది డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం కరోనాకు ట్రీట్‌‌మెంట్​తీసుకుంటున్న 444 మందిలో 382 మంది జీహెచ్‌‌ఎంసీ పరిధి వారే. మిగిలిన 62 మంది 18  జిల్లాలకు చెందినవారు.

రాష్ట్రంలో కొత్త కేసులు 51