దేశంలో లక్షా 25 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో లక్షా 25 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 50,357 కేసులు నమోదవగా మరో 577 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసులు 84,62,081 కు చేరగా.. మరణాలు 1,25,562 కు చేరాయి. నిన్న ఒక్కరోజే 53,920 మంది కోలుకున్నారు. దీంతో నిన్నటి వరకు 78,19,887 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 5,16,632 మంది ఆస్పత్రిలో ఉన్నారు. నిన్న ఒక్కరోజు దేశ వ్యాప్తంగా 11,13,209 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో నవంబర్ 6 వరకు కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 11,కోట్ల 65 లక్షల 42 వేల 304 కు చేరాయి.