దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్థలానికి సీపీ సజ్జనార్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్థలానికి సీపీ సజ్జనార్

దిశ హత్య ఎలా జరిగింది అనే విషయం తెలుసుకోవడానికి నిందితులను నిన్న చటాన్ పల్లికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో నలుగురు నిందితులు మరణించారు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది.. ఎన్‌కౌంటర్ ఎలా జరిగింది అనే దానిపై పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం సీపీ సజ్జనార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పోలీసులను అడిగి ఆయన సమాచారం తెలుసుకుంటున్నారు.