కొట్టేసిన సొమ్ముతో ఇద్దరు హీరోయిన్లకు కోట్ల గిఫ్టులు

కొట్టేసిన సొమ్ముతో ఇద్దరు హీరోయిన్లకు కోట్ల గిఫ్టులు
  • బాలీవుడ్ హీరోయిన్లతో మోసగాడు సుఖేశ్ దోస్తీ
  • కొట్టేసిన డబ్బుతో రూ.10 కోట్ల గిఫ్టులు ఇచ్చిండు

ముంబై: తీహార్ జైలు నుంచే రూ.200 కోట్ల బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడు.. కొట్టేసిన సొమ్ముతో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లతో దోస్తీ చేశాడు.. గిఫ్టులతో వారిని ముంచెత్తాడు..  రూ.52 లక్షల విలువైన గుర్రం.. రూ.9 లక్షల విలువైన పర్షియన్ పిల్లి.. లక్షలు విలువైన బంగారు అభరణాలు.. ఇలా మొత్తం 10 కోట్ల రూపాయల విలువైన బహుమతులను యాక్టర్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌‌కు ఇచ్చాడు. ఇదంతా మనీ లాండరింగ్ కేసులో నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ గురించే. అతడిపై ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక విషయాలను వెల్లడించింది. బెయిల్​పై బయటకు వచ్చాక చార్టర్డ్ ఫ్లైట్లలో తిరిగేందుకే రూ.8 కోట్లు ఖర్చు చేశాడట. జాక్వెలిన్‌‌తో పాటు మరో హీరోయిన్ నోరా ఫతేహీని కూడా సుఖేశ్ ఫ్రెండ్​షిప్​ చేశాడు. ఆమెకు ఒక బీఎండబ్ల్యూ కారు, ఐఫోన్‌‌తో పాటు మొత్తంగా రూ.కోటి విలువైన గిఫ్టులు ఇచ్చాడని సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోయిన్లను ఈడీ ప్రశ్నించింది. అవసరమైతే విచారణకు పిలుస్తామని వారికి చెప్పింది. ఈ గిఫ్టుల వ్యవహారం బీ టౌన్‌‌లో హాట్ టాపిక్.