రాష్ట్ర సీఎస్ శాంతి కుమారికి ప్రభుత్వం మరో కీలక పదవి అప్పజెప్పింది.రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ(రెరా) ఛైర్మన్ గా సీఎస్ శాంతికుమారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
1989 బ్యాచ్కు చెందిన శాంతికుమారి ఇటీవలే సీఎస్ గా నియమితులై రాష్ట్రంలో తొలి మహిళా సీఎస్ గా రికార్డ్ సృష్టించారు. ఏప్రిల్ 2025 వరకు ఈమె పదవిలో కొనసాగనున్నారు. శాంతికుమారి గతంలో సీఎంవోలో కార్యదర్శిగా .. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ గా పనిచేశారు.