ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో రాజ్ నాథ్.. సైనికుడిలా మారి..

ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో రాజ్ నాథ్.. సైనికుడిలా మారి..

ఇటీవలే తేలికపాటి యుద్ధ విమానం తేజస్ లో జర్నీ చేసిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఇప్పుడు యుద్ధనౌక INS విక్రమాదిత్యలో ప్రయాణించారు. హెలికాప్టర్ లో యుద్ధనౌకకు చేరుకున్న రాజ్ నాథ్.. సిబ్బందితో మాట్లాడారు. తర్వాత నౌకను పరిశీలించారు.

నౌకలోని ఆయుధాలు, వాటి పనితీరును చూశారు. సైనికుడిలా మారి.. మెషీన్ గన్ పట్టుకుని స్వయంగా ఫైరింగ్ చేశారు. యుద్ధవిమానాల ల్యాండింగ్ టేకాఫ్ వంటి విషయాలను పరిశీలించారు. దేశానికి నేవీ చేస్తున్న సేవలను కొనియాడారు రాజ్ నాథ్.