ట్విట్టర్ పై మరో కేసు నమోదైంది. ట్విట్టర్ లో బాలల అశ్లీల కంటెంట్ (చైల్డ్ పోర్నోగ్రఫీ) ఉందంటూ జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (NCPCR).. ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ సైబర్ పోలీసులు ట్విట్టర్ పై కేసు నమోదు చేశారు. వాస్తవానికి ట్విట్టర్ కు వ్యతిరేకంగా NCPCR కొన్నిరోజుల కిందటే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఢిల్లీ సైబర్ పోలీసులు స్పందించకపోవడంతో NCPCR లేటెస్టుగా సమన్లు పంపింది. ఈ క్రమంలో ట్విట్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ అన్యేష్ రాయ్ తెలిపారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన ఐటి నిబంధనల అమలు విషయంలోనూ కేంద్రానికి, ట్విట్టటర్కు మధ్య వార్ నడుస్తోంది.