విడిపోయిన ఇంజిన్: ధానాపూర్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం

విడిపోయిన ఇంజిన్: ధానాపూర్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం

జనగామ జిల్లా : స్టేషన్ ఘన్ పూర్ దగ్గర ధానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. బోగీల నుంచి ఇంజిన్ విడిపోయి అర కిలోమీటర్ దూరం వరకు వెళ్లింది. ఘన్ పూర్ రైల్వే గేటు దగ్గర బోగీలు ఆగిపోయాయి. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బోగీల నుంచి విడిపోయిన ఇంజన్ ను తిరిగి లింక్ చేసి తరలించారు.