జహీరాబాద్ నియోజకవర్గంలో భూప్రకంపనలు

జహీరాబాద్ నియోజకవర్గంలో భూప్రకంపనలు

జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం స్వల్పంగా భూమి కంపించింది. మధ్యాహ్నం12:30 గంటల ప్రాంతంలో  కోహిర్ మండలం మనియార్పల్లి, బిలాల్ పూర్, బడంపేట్, జహీరాబాద్ మండలం రంజోల్​ గ్రామ సమీపంలోని బాబానగర్ తదితర  గ్రామాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో జనాలు ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటి వరకు ఏం జరుగుతుందో అర్థం కాలేదని చెప్పారు.  బయటనే ఉండి తర్వాత ఎవరి ఇండ్లలోకి వారు వెళ్లారు.