న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని బేతుల్పార్లమెంట్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మృతిచెందారు. దీంతో ఎలక్షన్కమిషన్ అక్కడ ఎన్నికను బుధవారం వాయిదా వేసింది. ఈ నియోజకవర్గం లో రెండో దశలో ఈ నెల 26న లోక్సభ ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ స్థానం నుంచి పోటీకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్భలావికి మంగళవారం గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన మృతిచెందారు.
స్థానిక అధికారులు భలావి మృతిపై ఎన్నికల కమిషన్కు సమాచారం అందించారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 52 ప్రకారం బేతుల్ సెగ్మెంట్ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. ఆ స్థానంలో మే 7న మూడో దశలో ఎన్నిక నిర్వహించనున్నట్టు తెలిపింది. గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ అభ్యర్థి పోలింగ్కు ముందు మరణిస్తే, ఆ పార్టీ మరో అభ్యర్థిని గుర్తించి, నిలబెట్టేం దుకు ఎన్నికను వాయిదా వేస్తారు.