నాగేంద్రన్కు ఉరి అమలు
సింగపూర్: డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్ను సింగపూర్ ప్రభుత్వం బుధవారం ఉరితీసింది. నాగేంద్రన్కు మతిస్థిమితంలేదని, శిక్ష తగ్గించాలని ఆయన తల్లి, కుటుంబ సభ్యులు, మలేసియా ప్రధాని సహా చాలామంది చేసిన విజ్ఞప్తిని సింగపూర్ ప్రభుత్వం తోసిపుచ్చింది. లాయర్ ద్వారా నాగేంద్రన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను కోర్టు కొట్టేసిన తర్వాత శిక్ష అమలుకు ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా కుటుంబ సభ్యులను చూడాలన్న నాగేంద్రన్ కోరికను తీర్చి, బుధవారం తెల్లవారుజామున ఉరి తీసినట్లు అధికారులు చెప్పారు. మలేసియాకు చెందిన నాగేంద్రన్ధర్మలింగం 2009లో సింగపూర్లోకి డ్రగ్స్ తీసుకొస్తూ అధికారులకు పట్టుబడ్డడు.