హైదరాబాద్ :తండ్రి, కూతురు లిఫ్ట్లో ఇరుక్కుని నరకయాతన పడిన సంఘటన హైదరాబాద్లోని మణికొండలో జరిగింది. ల్యాంకో హిల్స్ ఫ్లాట్ నెం .1001, 17 ఎల్.హెచ్. లో నివాసముంటున్న శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి ఆదివారం తన కూతురుతో కలిసి లిఫ్ట్ ఎక్కాడు. అయితే సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంటనే డోర్ ఓపేన్ చేసేందుకు ఎలివేటర్లోని అన్ని అత్యవసర బటన్లను నొక్కాడు. అయినప్పటికీ లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో .. సాయం కోసం ఆర్తనాదాలు చేశాడు. దాదాపు 50 నిమిషాల పాటు అందులోనే నరకయాతన అనుభవించాడు. అక్కడ సరిగా గాలి, వెలుతురు లేకపోవడంతో తన కూతురికి ఏమవుతుందేనని భయంతో తన బలాన్నంతా కూడదీసుకొని లిఫ్ట్ తలుపులు గట్టిగా తెరిచాడు. చివరకి తన ప్రయత్నం ఫలించి తలుపులు తెరచుకోవడంతో లిఫ్ట్ నుంచి కూతురితో క్షేమంగా బయటపడ్డాడు.
జరిగిన సంగతి గురించి లాంకో హిల్స్ మేనేజ్ మెంట్ మరియు సెక్యూరిటికి తెలుపగా.. వారు నిర్లక్ష్యంగా స్పందించారు. దీంతో అతడు అపార్ట్మెంట్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాయదుర్గం పోలీసులు కే.సు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.