కశ్మీరీ హిందూ రాణి జీవితంపై సినిమా

కశ్మీరీ హిందూ రాణి జీవితంపై సినిమా

కశ్మీర్‌‌‌‌ని పాలించిన చివరి రాణి కోటా రాణి జీవితం ఆధారంగా త్వరలో సినిమా తీయనున్నారు. రిలయన్స్‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌, ఫ్యాంటమ్‌ ఫిలిమ్స్‌‌ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్‌‌ చేస్తున్నట్లు ప్రకటించారు. “ కోటా రాణి లాంటి గొప్ప వ్యక్తి గురించి మనకు సరిగా తెలీదు. సమర్థవంతమైన మహిళా పాలకుల్లో ఆమె కూడా ఒకరు” అని ఫ్యాంటమ్‌ ఫిలిమ్స్‌‌కు చెందిన మధు మంతెన చెప్పారు. ఆమె కథను వీలైనంత ఎక్కువ మందికి చేర్చాలనేదే తమ లక్ష్యం అని రిలయన్స్‌‌ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్‌‌ గ్రూప్‌‌ సీఈవో శుభాషిష్‌‌ సర్కార్‌‌‌‌ చెప్పారు. 13వ శతాబ్దంలో కాశ్మీర్‌‌‌‌ను పరిపాలించిన ఆమె గొప్ప సైనిక వ్యూహకర్త.