స్మార్ట్ ఫోన్ వాడే వాళ్లందరికీ ఆన్లైన్ పేమెంట్స్ చేయడం బాగా అలవాటైపోయింది. ఈజీగా ట్రాన్సాక్షన్ అయిపోతుంది అని ఎక్కువగా ఆ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అయితే, ప్రస్తుతం అందులో మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల నుంచి డబ్బు సేఫ్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అయితే, యూపీఐ పిన్ ఎవరికీ షేర్ చేయకూడదు. ఏదైనా మాల్వేర్ వెబ్సైట్ లేదా యాప్లో పిన్ రిజిస్టర్ చేయకూడదు. పిన్ని కూడా అప్పుడప్పుడు మార్చుతూ ఉండాలి.
యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి ముందు, రిసీవర్ వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో రిసీవర్ పేరు, యూపీఐ ఐడీ, మొబైల్ నంబర్ ఉంటాయి. యూపీఐ యాప్లోని ‘వెరిఫై పేమెంట్ అడ్రస్’ ఫీచర్ని వాడడం ద్వారా రిసీవర్ ఐడెంటిటీని కూడా ఓకే చేయొచ్చు.
కొన్నిసార్లు ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది. సెక్యూరిటీ యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్, యాప్లను లేటెస్ట్గా ఉంచడం ద్వారా డివైజ్ సేఫ్గా ఉంచుకోవచ్చు. డివైజ్ లాక్ చేసేందుకు స్ట్రాంగ్ పాస్వర్డ్ లేదా పిన్ని కూడా వాడాలి. దాంతోపాటు యూపీఐ పేమెంట్లను చేయాలంటే యాప్ లాగిన్ అవ్వడానికి ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నైజేషన్ వంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ మెథడ్ వాడాలి.
యూపీఐ యాప్ కోసం టూ–ప్యాక్టర్డ్ అథెంటికేషన్ (2FA) ని స్టార్ట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు యూపీఐ పిన్తో పాటు ఫోన్ నుంచి కోడ్ను ఎంటర్ చేయడం ద్వారా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ పొందచ్చు. ఆన్లైన్లో ఏ డేటాను షేర్ చేస్తున్నారో చూసుకుని చేయాలి. సోషల్ మీడియా లేదా ఇతర పబ్లిక్ ఫోరమ్లలో మీ యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఎప్పుడూ చేయకూడదు. వ్యక్తిగత సమాచారం కోసం ఏవైనా ఫేక్ మెసేజ్లు వస్తే రిజెక్ట్ చేయాలి. యూపీఐ పిన్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ గురించి ఏవైనా ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ వస్తే వెంటనే డిలీట్ చేయాలి.
ఫిషింగ్ స్కామ్
స్కామర్లు యూపీఐ పిన్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడాన్నే ఫిషింగ్ స్కామ్ అంటారు. ఈమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్లు గుర్తు తెలియని నంబర్ల నుంచి పంపుతారు. బ్యాంక్ లేదా పేమెంట్ యాప్లు వంటివి వచ్చినట్టు చూపిస్తుంది. అవన్నీ ఫేక్ మెసేజ్లు. అలాంటివేవైనా వస్తే, లింక్లపై క్లిక్ చేయకూడదు. ఏవైనా యాడ్ డాక్యుమెంట్లను ఓపెన్ చేయకూడదు. అందుకు బదులుగా, ఆ మెసేజ్ వెరిఫై చేయడానికి డైరెక్ట్గా కంపెనీని సంప్రదించాలి