
సీరియల్ నటి పవిత్ర జయరాం(Pavitra Jayaram) గత వారం కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన ఆమె ప్రియుడు, సహా నటుడు చంద్రకాంత్(Chandrakanth) ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దాంతో చంద్రకాంత్ కుంటుంబంలో విషాదం నెలకొంది. పవిత్ర జయరాం కారణంగానే తన భర్త చనిపోయాడని చంద్రకాంత్ భార్య చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, పవిత్రనే తన భర్తను తన వద్దకు రానివ్వకుండా చేసిందని సంచలన ఆరోపణలు చేసింది.
దీంతో తన తల్లి గురించి వస్తున్న కామెంట్స్ పై స్పందించారు పవిత్ర జయరాం కూతురు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రకాంత్- పవిత్రా జయరాం మంచి స్నేహితులు. వాళ్ళ బంధం గురించి తప్పుగా మాట్లాడకండి. తనతో కూడా చందు చాలాసార్లు ఫోన్లో మాట్లాడేవాడని, బాగా చదువుకోవాలి అని ఎంకరేజ్ చేసేవాడని, తన తల్లి అంత్యక్రియలకు కూడా చందు హాజరయ్యాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పవిత్ర జయరాం కూతురు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.