పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అనారోగ్యంతో దుబాయ్ లోని ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతూ 2016లో ట్రీట్ మెంట్ కోసం దుబాయ్ వచ్చిన ముషారఫ్.. ఆ తర్వాత స్వదేశం వెళ్లలేదు. ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలతోపాటు, రక్తపోటుతో ముషారఫ్ బాధపడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు.
ఈ క్రమంలో ముషారఫ్పై పాక్లో దేశద్రోహం కేసు నమోదై ఉంది. ఈ కేసులో లాహోర్ హైకోర్టు తీర్పు చేప్పనుంది. 3 నవంబరు 2007లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారంటూ ముషారఫ్పై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలంటూ ముషారఫ్కు కోర్టు అనేక సార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఈ కేసును ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది. ముషారఫ్ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది.