NCDC కి స్థ‌లం కేటాయించండి: కిషన్ రెడ్డి

NCDC కి స్థ‌లం కేటాయించండి: కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలకుంటున్న నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC)కి స్థలం కేటాయించాలంటూ సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 2019లోనే NCDC కి  కేంద్రం అనుమతించడంతో పాటు నిధులు కూడా విడుదల చేసిందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు స్థలం కేటాయించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు 3 ఎకరాల భూమి కావాలని అడిగి ఏడాదిన్నర అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. NCDC హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి ఉంటే కరోనాపై పోరాటానికి మరింతగా ఉపయోగపడేదన్నారు. కేంద్ర మంత్రితో మాట్లాడి NCDC హైదరాబాద్‌కు తీసుకుని వచ్చానని… మీరు స్థలం కేటాయిస్తే వెంటనే NCDC ఏర్పాటుకు బాధ్యత తీసుకుంటానన్నారు. ఇప్పటికైనా స్థలం గుర్తించి.. కేటాయించి… పనులు ప్రారంభించేలా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలంటూ లేఖలో కిషన్‌రెడ్డి కోరారు.