వైజాగ్ లో సీఎం జగన్ కి ఘన స్వాగతం

వైజాగ్ లో సీఎం జగన్ కి ఘన స్వాగతం

విశాఖపట్నంలో  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందనే ప్రచారం తర్వాత తొలిసారి విశాఖ వచ్చిన జగన్ కు .. ఎయిర్ పోర్టులో వైసీపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు గ్రాండ్ వెల్ కం చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి కైలాసగిరి, ఆర్కే బీచ్ లోని విశాఖ ఉత్సవ్ వేదిక వరకు  24 కిలోమీటర్ల మేర జగన్ కు స్వాగతం చెబుతూ మానవహారం నిర్వహించారు.

సీఎం వచ్చే దారిలో థ్యాంక్యూ జగన్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టారు. కాసేపట్లో  విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించనున్నారు ఏపీ సీఎం . విశాఖలో 12 వందల 85 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.