- ఈనెల 31 దాకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
- అభ్యర్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న టీఎస్పీఎస్సీ
- 8 నిమిషాల్లో దరఖాస్తు పూర్తవుతున్నట్లు వెల్లడి
- ఈ నెల 31 దాకా దరఖాస్తులకు అవకాశం
- అప్లికేషన్కు టీఎస్పీఎస్సీ ఓటీఆర్ తప్పనిసరి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టులకు ఆన్లైన్అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజైన సోమవారం సాయంత్రం 5 గంటల దాకా 3,895 మంది అప్లై చేసినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అప్లికేషన్ల ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అనే వివరాలను అభ్యర్థుల నుంచి అధికారులు సేకరించారు. తొలిరోజు అప్లై చేసిన పది మంది అభ్యర్థులకు ఫోన్లు చేసి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. తమకు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు ఎదురుకాలేదని, కేవలం 5 నుంచి 8 నిమిషాల్లో అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిందని అభ్యర్థులు చెప్పినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈనెల 31 దాకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని, గ్రూప్ 1 అప్లికేషన్కు టీఎస్పీఎస్సీ ఓటీఆర్ తప్పనిసరి. మొత్తం 25 లక్షల మందిలో సోమవారం నాటికి 1,54,785 మంది మాత్రమే ఓటీఆర్ అప్డేట్ చేసుకోగా, కొత్తగా 68,793 మంది ఓటీఆర్ క్రియేట్ చేసుకున్నారు.
దరఖాస్తు సమయంలో ఇవి ముఖ్యం
వెబ్సైట్లో అప్లికేషన్ ఆప్షన్ క్లిక్ చేయగానే, క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ కన్పిస్తోంది. దీంట్లో టీఎస్పీఎస్సీ ఐడీ, డేటాఫ్ బర్త్ ఎంటర్ చేస్తే, మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో గ్రూప్ 1 అప్లై, యూజర్ గైడ్ ఆప్షన్లుంటాయి. గ్రూప్1 అప్లైపై క్లిక్ చేసి కొన్ని వివరాలకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది.
- ఓటీఆర్ వివరాలు కరక్టేనా?
- ఇండియన్ సిటిజనేనా? తెలంగాణ వాసివేనా?
- గ్రాడ్యుయేషన్ రిజల్ట్ డిక్లేర్ డేట్, ప్రిమిలినరీ ఎగ్జామ్ రాసే భాషను (ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ) ఎంచుకోవాలి.
- మెయిన్ ఎగ్జామ్ ఏ భాషలో రాస్తారనే అంశాన్ని ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఒకటి ఎంచుకోవాలి.
- పోస్టు కోడ్ 4, 8, 11, 16కు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నయా లేవా అనేది చెప్పాలి. ఉంటే వాటి గురించి చెప్పాలి.
- ఎగ్జామ్ సెంటర్ కోసం 1 నుంచి 12 దాకా జిల్లాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలి.
- చివరగా క్రిమినల్ కేసులేమైనా ఉన్నాయా లేదా అనే వివరాలు చెప్పాలి.
- ఇవన్నీ ఇచ్చిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి, సబ్మిట్ చేయాలి. తర్వాత పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. దీంతో దరఖాస్తు పూర్తవుతుంది.