ప్రీతిని కాదు..ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి

ప్రీతిని కాదు..ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోండి

మిమ్మల్ని మీరు సేవ్ చేసుకున్నప్పుడే, మీరు ప్రీతిని సేవ్ చేయగలరంటూ క్యాప్షన్ తో  ట్రాఫిక్ పోలీసులు ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ ద్విచక్రవాహనదారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.

గతేడాది కేంద్ర రవాణ శాఖ విడుదల చేసిన ఘణాంకాల ప్రకారం 2018లో 199 దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల 1.5లక్షల మంది మరణించారు.

2017లో 48,746మంది ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీగంటకు నలుగురు ద్విచక్రవాహనదారుల్లో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో బైక్ రైడర్స్ హెల్మెట్ ధరించాలని కోరుతున్నారు. ట్రాఫిక్ ఏసీపీ అఖిల్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ రైడర్స్ కు 200హెల్మెట్లు, 500పెన్నులు, పువ్వులను గిఫ్ట్ గా ఇస్తూ హెల్మెట్ ధరించాలని ప్రచారం చేశారు.

తాజాగా గుర్ గ్రామ్ పోలీసులు దిచక్ర వాహనదారులు అవగాహకల్పించేలా కబీర్ సింగ్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని అనుకరిస్తూ చేసిన ట్వీట్ సినీ అభిమానుల్ని కట్టిపడేస్తుంది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో  షాహిద్‌ కపూర్, కైరా అద్వానీ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కబీర్ సింగ్. ఈ సినిమాలో  విలన్ నుంచి కైరా అద్వానీని కాపాడేందుకు షాహిద్ కపూర్ హెల్మెట్ లేకుండా ఆవేశంగా బయలుదేరుతాడు. ఆ సీన్ ను అనుకరించిన ట్రాఫిక్ పోలీసులు  చేసిన ట్వీట్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. “మిమ్మల్ని మీరు సేవ్ చేసుకున్నప్పుడే, మీరు ప్రీతిని సేవ్ చేయగలరంటూ” క్యాప్షన్ తో ఓ ఇమేజ్ ను షేర్ చేశారు.  ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.