మాజీ సీఎం నివాసంలో హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం

మాజీ సీఎం నివాసంలో హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం

భోపాల్: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరుగనుంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంగళవారంనాడు భోపాల్‌లోని తన నివాసంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన స్వయంగా ఇందులో పాల్గొన్నారు. దీనిపై కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం హనుమన్ చాలీసా పారాయణ నిర్వహించినట్టు చెప్పారు.

బుధ‌వారం(ఆగ‌ష్ట్ 5,2020) చారిత్రకమైన రోజని, ఆలయ భూమిపూజ కోసం యావద్దేశం ఎదురుచూస్తోందని కమల్‌నాథ్ అన్నారు. త‌మ‌ రాష్ట్ర ప్రజల తరుఫున రామ మందిర నిర్మాణానికి 11 వెండి ఇటుకలను అయోధ్యకు పంపుతున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల నుంచి సేకరించిన విరాళాలతో వీటిని కొనుగోలు చేసిన‌ట్టు క‌మ‌ల్‌నాథ్ తెలిపారు.