అపోలోకు చేరిన గుండె

అపోలోకు చేరిన గుండె

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి సక్సెస్ గా తరలించారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు మొదటి సారిగా డాక్టర్లు హైదరాబాద్ మెట్రోరైలును వినియోగించారు. గ్రీన్ ఛానల్ ద్వారా అపోలోకు గుండెను తరలించారు.

నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు గుండెను  దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో గుండెను ఆపరేషన్ ద్వారా మరోవ్యక్తికి అమర్చేందుకు అపోలో డాక్టర్లు ఏర్పాట్లు చేశారు.

గుండెను కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్ వరకు రోడ్డు మార్గంలో…నాగోల్ నుంచి జూబ్లీ చెక్ పోస్టు వరకు మెట్రో రైళ్లో తీస్కెళ్లారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మెట్రో స్టేషన్ నుంచి అపోలో ఆస్పత్రి వరకు రోడ్డు మార్గంలో తరలించారు.

డాక్టర్‌ గోఖలే నేతృత్వంలో శస్త్రచికిత్స చేయనున్నారు.దీనికి సంబంధించి ఇప్పటికే డాక్టర్లు ఏర్పాట్లు చేశారు.