జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నెల 29న సీఎంగా JMM చీఫ్ హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో JMM-కాంగ్రెస్-RJD నేతృత్వంలోని మహాకూటమి 47 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. ఈ క్రమంలో కూటమి నాయకుడు హేమంత్ సీఎం పదవి చేపట్టనున్నారు. హేమంత్ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్కు స్పీకర్ పదవితోపాటు నాలుగు నుంచి ఐదు మంత్రి పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది.
Jharkhand Mukti Morcha's (JMM) Hemant Soren: The oath taking ceremony will take place on December 29th. #Jharkhand https://t.co/qxdolJG5Kh
— ANI (@ANI) December 24, 2019