‘ఆర్ఎక్స్ 100’తో సెన్సేషన్ క్రియేట్ చేసినా.. ఆ తర్వాత నటిగా తాను కోరుకున్న స్థాయిని అందుకోలేకపోయింది పాయల్ రాజ్పుత్. ఓ మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఆమె రీసెంట్గా మంచు విష్ణుతో కలిసి ‘జిన్నా’ మూవీ చేసింది. రేపు మూవీ విడుదలవుతున్న సందర్భంగా మాట్లాడుతూ
‘ఆర్ఎక్స్ మూవీ నాకు మంచి పేరు తెచ్చింది. అయితే ఆ సినిమా తరువాత నా మేనేజర్తో పాటు కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో స్క్రిప్ట్ కూడా వినకుండానే సినిమాలు చేసేశాను. కథ విని, ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటేనే పేరు వస్తుందని తెలుసుకుని ఇప్పుడు జాగ్రత్తపడుతున్నాను. ‘అనగనగా ఓ అతిథి’ మూవీ చూసి మోహన్బాబు సర్ నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. తర్వాత రెండు నెలలకి ‘జిన్నా’లో చాన్స్ ఇచ్చారు. స్వాతి అనే విలేజ్ గాళ్ పాత్ర. పచ్చళ్లు అమ్ముతుంటాను.
నా రోల్తో పాటు మూవీ కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. విష్ణు, సన్నీ లియోన్లతో కలిసి నటించడం హ్యాపీ. ఈ సినిమాతో జర్నీ ఓ ట్రైనింగ్లా ఉపయోగపడింది. చాలా నేర్చుకున్నాను. టికెట్స్కి పెట్టే ఖర్చుతో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చూడొచ్చని ఓటీటీలకి వెళ్తున్నారు ఆడియెన్స్. అద్భుతమైన కంటెంట్ ఉంటేనే థియేటర్కొచ్చి చూస్తున్నారు. ఇది అలాంటి కంటెంట్ ఉన్న సినిమానే. దీని తర్వాత నావి మూడు సినిమాలు రానున్నాయి. కన్నడ మూవీ ‘హెడ్బుష్’ ఒక డాన్ బయోపిక్. అలాగే ‘మీటూ మాయాపేటిక’ మూవీలో ఐదు స్టోరీస్ ఉంటాయి. నాది చాలా ఇంటరెస్టింగ్ రోల్. ఇక ‘గోల్మాల్’ అనే తమిళ సినిమాలో జీవాతో యాక్ట్ చేస్తున్నాను. హిందీ మూవీ ‘దే ధనాధన్’కి ఇది రీమేక్. ఇంకొక సినిమా డిస్కషన్ దశలో ఉంది’ అని చెప్పింది పాయల్.