హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ ను పట్టుకున్న ఎన్ఐఏ

హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ ను పట్టుకున్న ఎన్ఐఏ

జమ్మూ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ మిలిటెంట్ ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్, కిష్త్ వర్ జిల్లాలోని హంజల ప్రాంతంలో మంగళవారం రాత్రి పోలీసులు రుస్తుం అలీ అనే మిలిటెంట్ ను పట్టుకున్నారు. గతేడాది ఏప్రిల్ లో ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్ చందర్ కాంత్ శర్మతోపాటు ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ను హత్య చేసిన కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీటులో రుస్తుం అలీ పేరు ఉంది. ఇదే కేసుతో సంబంధం ఉందని గత సెప్టెంబర్ 23న హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులు నిస్సార్ అహ్మద్ షేక్, నిషాద్ అహ్మద్, ఆజాద్ హుస్సేన్ లను కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో బీజేపీ స్టేట్ సెక్రటరీ అనిల్ పరిహార్, మరుసటి ఏడాది సీనియర్ ఆర్ఎస్ఎస్ కోశాధికారి శర్మ, ఆయన పీఎస్ఓల హత్య జరిగింది. కిష్త్ వర్ లో ఉగ్రవాదాన్ని తిరిగి పునరుద్ధరించే కుట్రలో భాగంగానే మిలిటెంట్స్ ఈ హత్యలు చేశారని అధికారులు తెలిపారు.