హైదరాబాద్: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీక గా నిలిచే పండుగ రక్షాబంధన్ పండుగ. సోమవారం ఈ పండుగ నేపథ్యంలో నగరంలో పలు చోట్ల రాఖీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా జనాలు రాఖీలు కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదని దుకాణదారులు అంటున్నారు. ఎన్నో రకాల రాఖీలు అందుబాటులో ఉన్నాయి, కానీ COVID- 19 కారణంగా అమ్మకం చాలా తక్కువగా ఉందని అంటున్నారు. రాఖీలకు కావాల్సిన ముడిసరుకును సేకరించడంలో తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని.. ఈ సంవత్సరం ఆవు పేడతో చేసిన రాఖీలను కూడా అందిస్తున్నామని అన్నారు.
Telangana: People in Hyderabad purchase rakhis ahead of #RakshaBandhan tomorrow. A shop owner says, "We have all types of rakhis but the sale is comparatively low due to #COVID19, we faced difficulty in procuring raw material. This yr we're also offering rakhis made of cow-dung" pic.twitter.com/8zlTn3b0zP
— ANI (@ANI) August 2, 2020