హైదరాబాద్ విద్యార్థికి రూ.42 లక్షల స్కాలర్ షిప్

హైదరాబాద్ విద్యార్థికి  రూ.42 లక్షల స్కాలర్ షిప్

హైదరాబాద్ లోని కార్వాన్ విద్యార్థి  మహ్మద్ సోహైల్ ఖాన్  బంఫర్ ఆఫర్ కొట్టేశాడు. మహారాష్ట్రలోని పూణేలో ప్రతిష్టాత్మక మహీంద్రా యునైటెడ్ వరల్డ్ కాలేజీలో ఎంట్రీ కోసం రూ. 42 లక్షల స్కాలర్‌షిప్ పొందాడు. అతను ఈ నెలాఖరులో కాలేజీల్ జాయిన్ అవుతాడు. సోహైల్ ఖాన్ సబ్జి మండి గ్రేస్ మోడల్ స్కూల్ లో ఈ ఏడాది పదవ తరగతి పాసయ్యాడు. అతను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు అతని తండ్రి 2017 లో మరణించారు. అతని తండ్రి మరణం తరువాత, పాఠశాల యజమానులు మీర్జా ఇర్ఫాన్ బేగ్ ,అయేషా సిదిక్వా అతని చదువు బాధ్యతలను తీసుకున్నారు. వారి స్కాలర్‌షిప్ కింద, సోహైల్ తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు.  సోహైల్‌తో పాటు, మరో విద్యార్థి  ఖ్వాజా బేగ్‌కు  స్కూల్ యజమానులు స్కాలర్‌షిప్ కూడా అందించారు. ఈ సంవత్సరం, బేగ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు.   బేగ్ ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడు.