బీఆర్ఎస్ లీడర్లకు సెక్రటేరియెట్లోకి ఎనీ టైమ్ ఎంట్రీ
ప్రతిపక్ష నాయకులు, ప్రజలకు మాత్రం రూల్స్
మహారాష్ట్ర లీడర్లకు అయితే స్పెషల్ ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు : కొత్త సెక్రటేరియెట్లో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన అమలవుతోంది. అధికార పార్టీ నేతలకు ఒకలా.. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలకు ఇంకోలా ఎంట్రీ లభిస్తున్నది. ఇక ప్రతిపక్ష లీడర్లను అయితే ఆ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. గురువారం మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్లీడర్లకు సెక్రటరియెట్లోకి స్పెషల్ఎంట్రీ లభించింది. విజిటర్స్టైమ్ లో కాకుండా, ఎలాంటి పాస్లు లేకున్నా ఒక్క ఫోన్కాల్తో 20 మందికి పైగా లీడర్లు లోపలికి వెళ్లారు. దీంతో సెక్రటేరియెట్ లోపలికి వెళ్లేందుకు పొద్దున్నే 11 గంటల వరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విజిటర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ వాళ్లకి పాస్లు.. వేరే రాష్ట్రమైతే డైరెక్ట్ ఎంట్రీనా? అంటూ మండిపడ్డారు. తమకేమో టైమింగ్స్ పెట్టారని, ఇతరుల విషయంలో మాత్రం అలా లేదా? ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లీడర్లు ఎవరైనా సరే సెక్రటేరియెట్లోకి వెళ్లేందుకు పెద్దగా ప్రాసెస్ఏమీ ఉండట్లేదు. ముందే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి.. ‘పలానా వాళ్లు వస్తున్నారు. పంపించండి’ అని చెబుతున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ సమస్యలతో వచ్చే ప్రజలకు మాత్రం రూల్స్ పెడుతున్నారు. వచ్చిన వాళ్లందరినీ కాకుండా పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు.