భారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్కు ఏడాది

భారత్లో కోవిడ్ వ్యాక్సినేషన్కు ఏడాది

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రజల కోసం ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించింది. నేటికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊరు వాడా విజయవంతగా నడుస్తోంది. ప్రతీ పల్లె, గ్రామంలో కూడా కరోనా టీకా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా కరోనాపై పోరులో భారత్ మరో కీలక మైలురాయిని చేరింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై నేటితో ఏడాది పూర్తియింది. పూర్తిగా ఉచితంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియాలో అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. గతేడాది జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్లకు  క్సినేషన్ ఇవ్వడం మొదలైంది. మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈనెల 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ప్రారంభంలో వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది భయపడ్డారు. కొందరు భయంతో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా ఉన్నారు. అనేక అనుమానాలు, అపోహల మధ్య దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయినప్పటికీ… తక్కువ కాలంలోనే అనేక రికార్డులు సొంతం చేసుకుంది. దేశంలో ఇప్పటి వరకు 156 కోట్ల కరోనా డోసులను ఇచ్చారు. ఇందులో 90 కోట్లు మొదటి డోసులు కాగా…65 కోట్ల డోసులు రెండో డోసు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లు ఉచితంగా ప్రజలకు అందించారు. ఇక రెండు డోసులు పూర్తయిన వారికి... ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేలా బూస్టర్ డోసు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీంతో పలువురు ప్రముఖులు.. ప్రజలు.. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. 

ఇవి కూడా చదవండి: 

కరోనా కలకలం.. తమిళనాడులో లాక్ డౌన్

ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కరోనా