లండన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంతో మన దేశంలో ఈ వారంలోనే కరోనా కేసులు భారీగా పెరుగుతాయని బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి ప్రొఫెసర్ పాల్ కటుమాన్ వెల్లడించారు. కేంబ్రిడ్జిలోని జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్, కొవిడ్ 19 ఇండియా ట్రాకర్ ను అభివృద్ధి చేసిన టీంలో ఒకరైన పాల్.. ఇటీవల మన దేశంలో కరోనా పరిస్థితిపై నోట్ ను విడుదల చేశారు. ‘‘సుమారు 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఒమిక్రాన్ కారణంగా ఈ వారం రోజుల్లోనే కేసులు పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, కొద్దిరోజుల్లోనే తిరిగి కేసులు తగ్గుముఖం పట్టొచ్చు” అని ఆయన పేర్కొన్నారు. డైలీ కేసులు ఎంత హైలెవల్ కు చేరుతాయన్నది మాత్రం అంచనా వేయలేమన్నారు. మొదట 6 రాష్ట్రాల్లోనే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని అంచనా వేసిన తాము.. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరగొచ్చని అంచనాలను సవరించామని ఆయన తెలిపారు. కాగా, మే నెలలో సెకండ్ వేవ్ సమయంలో మన దేశంలో కరోనా పీక్ స్టేజీని కొవిడ్ 19 ఇండియా ట్రాకర్ ద్వారా పాల్ కటుమాన్ టీమ్ వేసిన అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి. టీకాలు తగినన్ని వేసేంత వరకూ దేశంలో వైరస్ వ్యాప్తి చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంటుందని గత ఆగస్టులోనూ వీళ్లు అంచనా వేశారు. దేశంలో అక్టోబర్ నెలలో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆ తర్వాతే డైలీ కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
ఈ వారంలో కరోనా కేసులు భారీగా పెరుగుతయ్
- దేశం
- December 30, 2021
లేటెస్ట్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కొత్త మిస్అమెరికా ఎవరంటే..
- స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్
- RGV And Revanth reddy: ఫైర్ క్రాకర్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎంపై వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- Sunil Turbo: మెగాస్టార్కు విలన్గా సునీల్..ఆటో బిల్లా క్యారెక్టర్తో మలయాళ ఎంట్రీ..
- కాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్ రావు
- Naga babu: ట్విట్టర్కి రీ-ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మరో పోస్ట్తో క్లారిటీ ఇచ్చేశాడుగా!
- ఏంటీ కిరాతకం : పట్టపగలు.. నడి రోడ్డుపై వ్యాపారిపై కాల్పులు
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!