సూసైడ్ నోట్: బెదిరించి ఇల్లు కొన్నారని వ్యక్తి ఆత్మహత్య

సూసైడ్ నోట్: బెదిరించి ఇల్లు కొన్నారని వ్యక్తి ఆత్మహత్య

తన ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నారు ఓ వ్వక్తి. చనిపోయే ముందు సుసైడ్ నోట్ రాసి ప్రాణాలు వొదిలారు మల్కాజ్ గిరి ఉప్పరిగూడాకు చెందిన జగన్నాధం. ఆయన రాసిన సూసైడ్ నోట్ ఈ విధంగా ఉంది. చిప్ప శేఖరయ్య అతని కొడుకులు శ్రీను, రఘు, మహి మరియు పుట్ట బాల్ రాజ్, మామిడి సత్య నారాయణ లు కలిసి మల్కాజ్ గిరిలో ఉన్న తన ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సూసైడ్ నోట్ లో రాశారు జగన్నాధం. తనకు ఇల్లు అమ్మడం ఇష్టం లేకపోయినా దౌర్జన్యంగా వారి పేరుమీద రాయించుకున్నారని తెలిపారు.  వీరిని కఠినంగా శిక్షించి తన పిల్లలకు న్యాయం చేయాలని కోరారు. రూ.40 లక్షల విలువైన తన ఇంటికి కేవలం 6లక్షల 10 వేలు ఇచ్చారని సూసైడ్ నోట్ లో రాశారు.

తన చావుకు మరో కారణం ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లని సూసైడ్ నోట్ లో తెలిపారు జగన్నాధం. 17 లక్షల రూపాయల ఫైన్ కట్టమని ఒత్తిడి చేశారని ఆ ధనాన్ని కట్టే స్థోమత తనకు లేదని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని నోట్ లో రాశారు. అక్రమంగా తన ఇల్లును కొన్న వాళ్లను.. 17 లక్షల ఫెనాల్టీ అంటూ తనను వేధించిన  ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వాళ్లను కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్ లో కోరారు జగన్నాధం.