ఢిల్లీ పేలుడు మా పనే: జైష్ ఉల్ హింద్

ఢిల్లీ పేలుడు మా పనే: జైష్ ఉల్ హింద్

దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర నిన్న(శుక్రవారం) సాయంత్రం జరిగిన బాంబు పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు తామే కారణమని ఉగ్రసంస్థ జైష్ ఉల్ హింద్ ప్రకటించుకుంది. సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనికి సంబంధించి మీడియాలో కథనాలు వచ్చాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఈ ఉగ్రసంస్థ ప్రకటనను గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సంస్థ పేరు ఎప్పుడు, ఎక్కడా వినలేదని.. తెలియదని చెబుతున్నారు అధికారులు.

మరోవైపు పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. పేలుడుకు కారణమైన ఉగ్రసంస్థ క్రియాశీల సభ్యుల సమాచారం సేకరించాలని ఈ సమావేశంలో ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. స్లీపర్ సెల్స్ వివరాలను కూడా సేకరించాలని ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ పేలుడు ఘటన దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.