
మెగా కుటుంబం నుంచి వచ్చిన ‘అల్లు శిరీష్’ లేటెస్ట్ ఫిల్మ్ ‘ఊర్వశివో రాక్షసివో’ నుంచి ‘కలిసుంటే’ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరోయిన్ గా అను ఇమ్మాన్యూల్ నటించారు. ‘కలిసుంటే నువ్వు నేనిలా.. కలలాగానే ఉంది నమ్మవా’ అంటూ రొమాంటిక్ గా ఈ సాంగ్ సాగింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. గీత ఆర్ట్స్-2 పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ చేపడుతోంది. ఈ నెల 30న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేస్తున్నారు. శ్రీకుమార్గా అల్లు శిరీష్, సింధుగా అను ఇమ్మాన్యూల్ కనిపిస్తున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటారు. ఇంట్లో అమాయకంగా ఉండే శిరీష్, బయట మాత్రం అనుతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. వెన్నెల కిశోర్, సునీల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.