40 ఎంపీ సీట్లలో పోటీ చేస్తాం : కమల్ హాసన్

40 ఎంపీ సీట్లలో పోటీ చేస్తాం : కమల్ హాసన్

చెన్నై : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కలిపి 40 ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సినీ నటుడు, మక్కల్ నీధి మైయమ్(MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ ప్రకటించారు. కళంకితమైన పార్టీలు, గ్రూపులతో తాను పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది ఈ సమయంలో చెప్పలేను అన్నారు కమల్ హాసన్.