రైతులకు వారి హక్కులు కల్పించాలి: రాహుల్‌

రైతులకు వారి హక్కులు కల్పించాలి: రాహుల్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మద్దతు పలికారు. కేంద్రం అహంకారాన్ని వీడి.. రైతులకు వారి హక్కులు కల్పించాలంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. మనకు అన్నం పెట్టే రైతన్నలు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారన్నారు. అయితే టీవీల్లో మాత్రం అబద్ధపు ప్రసంగాలు  ఇంకా వినిపిస్తూనే ఉన్నాయన్నారు. అన్నదాతల శ్రమకు మనం ఎప్పటికీ రుణపడి ఉన్నామని… అలాంటి రైతులకు న్యాయం, హక్కులు కల్పించి రుణం తీర్చుకోవాలన్నారు. వారిపై లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి కాదన్నారు. ఇప్పటికైనా మేల్కోవాలని… అహంకారమనే కుర్చీ నుంచి దిగి రైతులకు హక్కులు కల్పించండి అంటూ కేంద్రానికి సూచిస్తూ ట్వీట్‌ చేశారు రాహల్.