టీఆర్ఎస్ తండ్రి కొడుకుల పార్టీ

 టీఆర్ఎస్ తండ్రి కొడుకుల పార్టీ

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి. ఇప్పుడున్నది.. టీఆరెస్ పార్టీ కాదని.. అది తండ్రి కొడుకుల పార్టీ అని అన్నారు. హనమకొండ జిల్లా కమలాపూర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు. ఎంతో మంది డిగ్రీలు చదువుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70 శాతం యాంటీ కేసీఆర్ ఓట్లు పడ్డాయని చెప్పారు. అక్కడ చాలా ఓట్లు బోగస్ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ ను అభిమానించే వారి సంఖ్య 20 శాతం లోపేనని..TRS కు  ఓటు బ్యాంకు హుజురాబాద్ లో లేదని స్పష్టం చేశారు.ఇక్కడ జరుగుతున్నది కేసీఆర్, ఈటల మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. డబ్బుతో మద్యం సీసాలతో ఓట్లు సంపాదించాలని చూస్తున్నారని అన్నారు. 
 
ఈటల రాజేందర్ వల్లనే దళిత బంధు వచ్చిందని అన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. లక్షల కోట్లు అప్పులు చేసినా ఎవరికి లాభం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు.మా చేవేళ్ల ప్రాంతానికి సాగునీరు రాలేదని. దీనికి సంబంధించి ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారన్నారు. ఓడిపోయే చోటికి యువరాజ కేటీఆర్ ను పంపరు.. అందుకే దుబ్బాకకు కూడా పంపించలేదని అన్నారు. హుజురాబాద్ కు కేటీఆర్ వచ్చి ప్రచారం చేసే ధైర్యం ఉందా ? అని ప్రశ్నించారు.

ఎన్నికల్లో ఓడిపోతే మా మిత్రుడు హరీశ్ రావుపై ఓటమి భారం వేస్తారని అన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని..ఎన్ని డబ్బులు పెట్టినా మద్యం పోసినా ఈటలకే మా ఓటు అనడం సంతోషమన్నారు. ఈటల రాజేందర్ హుజురాబాద్ కే పరిమితం కాదు..  రాష్టంలో ఆయన సేవలు అవసరమన్నారు. హుజురాబాద్ లో మాకు సంబంధించి 20 టీంలు పార్టీలకు అతీతంగా సర్వే చేస్తూ ప్రచారం చేస్తున్నామని తెలిపారు.